ఉత్తమ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు అనుపమ నమస్తే భారత్ :-తొర్రూరు మండలంలోని నాంచారి మడూరు గ్రామ గ్రామంలోని జయంతి కాలనీలో ఉన్న జెడ్పీఎస్ఎస్ పాఠ
ఉత్తమ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు అనుపమ
నమస్తే భారత్ :-తొర్రూరు
మండలంలోని నాంచారి మడూరు గ్రామ గ్రామంలోని జయంతి కాలనీలో ఉన్న జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్న ఎన్. అనుపమ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా అవార్డు అందుకున్న.ఉపాధ్యాయురాలు అనుపమ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

COMMENTS