కార్గిల్ సెంటర్లో సైడ్ డ్రైనేజ్ పనుల పరిశీలించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పానుగోతు రాం
కార్గిల్ సెంటర్లో సైడ్ డ్రైనేజ్ పనుల పరిశీలించిన
డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పానుగోతు రాంలాల్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కార్గిల్ సెంటర్లో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
పట్టణంలో పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు రాము, జాటోతు సురేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పానుగోతు రాంలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ తాజోద్దీన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS